కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని యతీ రెస్టారెంట్ ను విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజి, రెవెన్యూ అధికారులు కలిసి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఆ తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు LM చట్టం 2009 సెక్షన్ 8/25 ప్రకారం 150 కిలోలు, 30 కిలోల కెపాసిటీ గల అన్స్టాంప్డ్ వెయింగ్ మెషీన్లు కలిగి వుండడంవల్ల కేసు నమోదు చేసారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ లో నిల్వ కుకీలు లభించడంతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 సెక్షన్ 27 (3)(A) కింద మరో కేసును నమోదుచేసారు.
ఈ సందర్భముగా రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి. శ్రీ ఎ .సురేష్ బాబు గారు మాట్లాడుతూ… రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ మీటర్ రీడింగ్ 25% లోపు వుండవలసిన దానికన్న ఎక్కువగా వుందని దాని వలన ప్రజల ఆరోగ్యానికి హానికరం కావున టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25% లోపున వుండేలా రెస్టారెంట్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
సామర్లకోట రెస్టారెంట్ లో విజిలెన్స్ ఆకస్మిక తనికీలు…
![WhatsApp Image 2023-12-23 at 7.13.17 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-23-at-7.13.17-PM.jpeg?resize=1024%2C700&ssl=1)