కాకినాడ జిల్లాలో సామర్లకోట రైల్వే గేటును ట్రాక్ మరమ్మతులు నిమిత్తం ఈనెల 28 నుంచి మార్చి 6 వరకూ మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే ప్రజలు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద రెండు కిలోమీటర్ల అదనంగా ప్రయాణించి కాకినాడ రోడ్లోకి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కాకినాడ నుంచి సామర్లకోట ఊర్లోకి వచ్చే ద్విచక్ర వాహనదారులు రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా స్టేషన్ సెంటర్ మీదుగా సామర్లకోటలోకి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రామసుబ్బారావు తహశీల్దార్, సీ.ఐ. లకు ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని లేఖలు పంపారని అధికారులు అన్నారు. ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఉత్తర క్యాబిన్ రైల్వే గేట్ ను మూసి వేస్తున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ రమేష్ ధ్రువీకరించారు.