News

సామర్లకోట 31 వ వార్డులో మంచి నీటికి కటకట

https://youtu.be/3yOWD2TrXYE

సామర్లకోట మున్సిపాలిటీలోని 31 వ వార్డులో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. కుళాయిల ద్వారా అందించే రక్షిత మంచినీరు సరిపడకపోవడంతో వార్డులో ఉన్న బోరు ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తన్నారు. ఈ క్రమంలో బోర్ ఆపరేటర్ గా నియమించబడ్డ వీరబాబు ను అధికారులు వేరొక విధుల్లో మళ్లించడంతో బోరు నిర్వహణకు సంబంధించి అవగాహన లేనివారిని అక్కడ నియమించారు. దానితో తాజాగా బోరు ఎలక్ట్రికల్ మోటార్ స్విచ్ కి సంబంధించి ఫీజులు బోర్డు కాలిపోవడంతో వార్డు ప్రజలు త్రాగునీరు అంతక శుక్రవారం ఇబ్బందులు పడ్డారు. దానితో వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రజలకు అందించే ఏర్పాటు చేశారు. అయితే సరైన బోర్ ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో తరచూ తాగునీటి ఇబ్బందులు తమకు ఎదురవుతున్నాయని వార్డు ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి అనుభవం ఉన్న బోర్ ఆపరేటర్లను ఏర్పాటు చేసి, తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం