సామర్లకోట మున్సిపాలిటీలోని 31 వ వార్డులో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. కుళాయిల ద్వారా అందించే రక్షిత మంచినీరు సరిపడకపోవడంతో వార్డులో ఉన్న బోరు ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తన్నారు. ఈ క్రమంలో బోర్ ఆపరేటర్ గా నియమించబడ్డ వీరబాబు ను అధికారులు వేరొక విధుల్లో మళ్లించడంతో బోరు నిర్వహణకు సంబంధించి అవగాహన లేనివారిని అక్కడ నియమించారు. దానితో తాజాగా బోరు ఎలక్ట్రికల్ మోటార్ స్విచ్ కి సంబంధించి ఫీజులు బోర్డు కాలిపోవడంతో వార్డు ప్రజలు త్రాగునీరు అంతక శుక్రవారం ఇబ్బందులు పడ్డారు. దానితో వార్డు కౌన్సిలర్ పాగా సురేష్ కుమార్ ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రజలకు అందించే ఏర్పాటు చేశారు. అయితే సరైన బోర్ ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో తరచూ తాగునీటి ఇబ్బందులు తమకు ఎదురవుతున్నాయని వార్డు ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణం స్పందించి అనుభవం ఉన్న బోర్ ఆపరేటర్లను ఏర్పాటు చేసి, తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.