ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు స్వయంగా నిందితుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అంగీకరించినా అతడిని ముఖ్యమంత్రి వెంటపెట్టుకుతిరగడం పట్ల వివక్షా సాధికారత కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.