గ్లోబల్ పీస్ యూత్ కమిటీ 5వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో చేసిన సేవలను గుర్తించి పురస్కారాలను ప్రధానం చేసారు. హంస్రాజ్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎల్.టి.జె.న్. ఎ.బి. శివనే ముఖ్య అతిధిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా షేక్ మీరకు గ్లోబల్ యూత్ పీస్ కమిటీ ఎక్సలెన్స్ కమ్యూనిటీ బిల్డర్ మరియు జి. సాయి శశాంక్ కు సోషల్ ఇన్నోవేటర్ అవార్డ్ 2024 అందుకున్నారని కళాశాల ప్రిన్సి పాల్ తెలియచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అయినా 17 అంశాలు జ్యూరీ ప్రధమంగా పెట్టుకొని జాతీయంగా 200 మంది దరకాస్థులలో మా కళాశాలాల ఎన్.ఎస్.ఎస్. పి.ఓ. తో పాటు వాలంటీర్ కి అవార్డు రావడం అభినందనీయం అని అన్నారు. కళాశాల విద్యా ర్దులు, అధ్యాపకులు, యజమాన్యం అవార్డు గ్రహీతలను అభినందనలు తెలిపారు.
సామాజిక సేవకు అవార్డులు…
![OIP (26)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIP-26.jpg?resize=474%2C248&ssl=1)