Exclusive

సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు…

WhatsApp Image 2024-02-21 at 6.41.57 PM

కాకినాడలోని కలెక్టరేట్ కోర్టు హలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశిన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి వివిధ రాయితీల మంజూరు అంశాలపై ఆమె సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 172 ధరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 148 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసారని, 19 ధరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. మరో 5 ధరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జి.యం. టి. మురళీ, ఎల్డిఎం సిహెచ్ఎస్వీ ప్రసాద్, డి.పి.ఓ. కె. భారతి సౌజన్య, డిప్యూటీ ఛీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ డి. రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.