హిమాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారీ మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాల్జోర్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య తమంగ్ మరియు ఆయన మంత్రిమండలితో పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయించారు.
సిక్కింలోని మంత్రి మండలిలో ముఖ్యమంత్రితో సహా 12 మంది సభ్యుల బలం ఉంది. తమాంగ్ అసెంబ్లీ ఎన్నికలలో, సిక్కింలోని ఏకైక లోక్సభ స్థానంలో ఎస్.కే.ఎం. యొక్క అఖండ విజయానికి నాయకత్వం వహించారు. జూన్ 2న జరిగిన సమావేశంలో ఆయనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన ఈ ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గానూ 31 స్థానాలను ఎస్.కె.ఎం. గెలుచుకుంది. తమాంగ్ తాను పోటీ చేసిన రెనోక్, సోరెంగ్-చకుంగ్ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. 2019 వరకు వరుసగా 25 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది.