సివిల్ సర్వీసెస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధారమైన ఆరోపణలు చేసిందని విద్యాశాఖ మంత్రి, చీపురుపల్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులతో సహా సివిల్ సర్వెంట్లు ఎన్నో ఏళ్లుగా వివిధ ముఖ్యమంత్రుల హయాంలో వివిధ ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పులు చేస్తే అధికారులందరిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులతో బొత్స మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోందన్నారు. జి.డి.పి. లో రాష్ట్రం ఇప్పుడు 16వ స్థానం నుంచి నాలుగో స్థానంలో ఉందన, సంక్షేమ పథకాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. పీ.కే. వైఎస్సార్సీపీలో ఉన్నారని, ఆయన గురించి పార్టీకి బాగా తెలుసునని, అందుకే పీ.కే. సలహాలను 100% అమలు చేయకుండా వైఎస్సార్సీపీ తనదైన విజన్ని తీసుకుందని బొత్స అన్నారు.