Political

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కమిషనర్‌ నాగనరసింహారావు

WhatsApp Image 2023-10-20 at 6.11.28 AM

సీజనల్‌ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు ప్రజారోగ్య విభాగాన్ని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై ఎం.హెచ్‌.వో డాక్టర్‌ ఫృద్వీచరణ్, యు.పీ.హెచ్‌.సీ.ల మెడికల్‌ ఆఫీసర్లు, జిల్లా మలేరియా అధికారి భాస్కరరావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లతో ఈ అంశంపై సమావేశమయ్యారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఇప్పటి నుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులపై కూడా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వ్యాధులు వచ్చి ఆస్పత్రిపాలయ్యే పరిస్థితులకన్నా ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యవంతం చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అలాగే ప్రజారోగ్య విభాగానికి సంబంధించి ఫుష్‌కేట్‌లతో పాటు ఇంకేమైనా పరికరాలు అవసరమైతే వెంటనే నివేదిక ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా సిబ్బంది పనిచేసేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో శానిటరీ సూపర్‌వైజర్లు జిలానీ, రాంబాబు, ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.