తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాజిక వర్గం సమక్షములో మాజీ ఎం.పీ., చిత్ర రంగ సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షులు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమున కి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ… జమున తోలుబొమ్మలాట కళాకారు కుటుంబాలకు 176 ఇండ్లపట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పటు చేయడం జరిగిందని తెలిపారు.
తోట వెంకటరమణమ్మ గారు మాట్లాడుతూ… నివాసాలు ఏర్పటుచేయడమే కాకుండా తమ ఆర్ధిక పరిస్థితి గమనించి ఇండ్లు నిర్మించుకోవడానికి కొంత ఆర్థిక సాహాయం కూడా చేశారు. అమెకు ఎంతో రుణపడతి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో టి. త్రిమూర్తులు, టి.రమణ, టి.శ్రీనివాస్, ఎ. భీమన్న, వి. నూకాలమ్మ, టి. అన్నపూర్ణ, ఎ. పాపారావు మరియు జమున నగర్ యూత్ తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాని నిర్వహించడం జరిగింది.