లోక్సభలో సీ.పీ.ఎం. పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ నేత, అలత్తూరు ఎం.పీ. కే. రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలియజేశారు. సీ.పీ.ఎం. కేంద్ర కమిటీ సభ్యుడు, కే. రాధాకృష్ణన్ దళిత సామాజిక ముక్తి మంచ్ జాతీయ అధ్యక్షుడు కూడా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1996 ఇ కె నాయనార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తరువాత 2006-11లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడానికి ముందు ఆయన పినరయి విజయన్ ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీ సంక్షేమం, దేవస్వామ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
సీపీఎం లోక్సభ పార్టీ నాయకుడుగా కే రాధాకృష్ణన్ ఎంపిక…
![k](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/k.jpg?resize=474%2C248&ssl=1)