ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీ.బీ.ఐ. తన భర్తను అరెస్టు చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత గురువారం మరోసారి మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జైలు నుంచి బయటకు రాకుండా ఉండేలా వ్యవస్థ ఉందని బుధవారం ఆమె ఆరోపించారు.
అరవింద్ కేజ్రీవాల్ జూన్ 20న బెయిల్ పొందారు. వెంటనే ఈ.డీ. స్టే తెచ్చుకుందన్నారు. ఆ మరుసటి రోజే సీ.బీ.ఐ. అతడిని నిందితుడిగా చేర్చిందని ఆరోపించారు. ఈ రోజు అతన్ని అరెస్టు చేశారని, మనిషి జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకు మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోంది ఇది చట్టం కాదని, ఇది నియంతృత్వం, ఇది ఎమర్జెన్సీ’ అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసింది.