కాకినాడ నగరంలో గండేపల్లి మండలం సూరంపాలెంలో ఉన్న ఆదిత్య ఇంస్టీట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకలను వివిధ (ఇంజనీరింగ్, ఫార్మసి) కళాశాలలకు చెందిన సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా. ఎన్. సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు.
భోగి మంటలు, గొబ్బమ్మలు, గాలిపాటాలు, పందెం కోళ్లు, ఫ్యాషన్ షో జనాలను ఆకాటుకున్నాయి. విద్యార్దిని, విద్యార్ధులకు ఆటల పోటీలు నిర్వహించారు. అందులో గెలిచిన వారికి బహుమతులను అందచేశారు. ఈ కార్యాక్రమానికి వైస్ చైర్మన్ డా. ఎన్. సతీష్ రెడ్డి, కాలేజీ స్టాఫ్, విద్యార్దిని, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.