సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం అని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి. నాగమణి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, రోటరీ క్లబ్ కాకినాడ మరియు బ్లడ్ క్రాస్ సోమయాటి సంయుక్త ఆధ్వర్యం లో స్థానిక ఎమ్.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల నందు రెండు రోజుల పాటు నిర్వహించు జిల్లా స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైనది. ఈ కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, రోటరి క్లబ్ కాకినాడ మరియు బ్లడ్ క్రాస్ సోమయాటి సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రనికి ముఖ్య అతిథి గా విచ్చేసిన పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి. నాగమణి మాట్లడుతో… సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం అని అన్నారు. పర్యవరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన ఎమ్.ఎస్.ఎన్ చారిటిస్ చైర్మన్ మల్లాడి కార్తీక్ నాయకర్ మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎమ్. మురళీధర్ మాట్లాడుతూ… విద్యార్ధుల శాస్త్రీయ, సాంకేతిక, సామాజిక విషయాల గురించి అవగాహన కొరకు సైన్స్ కాంగ్రెస్ సహకరిస్తుందన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ కార్యదర్శి ఎస్.వి రావు అరిగెల(బాబి) మాట్లాడుతూ… ప్రతి విద్యార్థీ ఒక శాస్త్రవేత్త గా ఎదగాలని ఆకాంక్షించారు