కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, తండ్రి మేఘరాజు లు సేకరించారన్నారు.
అనంతరం హేమచంద్రపురానికి చెందిన డ్రైవర్లు చందు, పి. సాయి భారత్ ల ద్వారా అక్కడ నుండి కాకినాడకు రవాణా చేస్తున్నారని అన్నారు. సదరు పి.డి.ఎస్. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారుల తెలిపారు. సంబందిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు కొరకు పోలీసు స్టేషన్ కు సిఫారసు చేయటమైనది. ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు నాగ వెంకట రాజు, లక్ష్మీనారాయణ, సి.ఎస్.డి.టి కీర్తి, విజయకుమారి మరియు జీవానందం పాల్గొన్నారు .