సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం, ఆదిత్యా విద్యాసంస్థల ఆధ్వర్యంలో సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ అనే అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (పరిపాలన) పి. శ్రీనివాస్ ఈ పోటీలను పరిశీలించారు. విద్యార్థులకు “లైంగిక వేధింపుల నుండి మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక పాత్ర “అనే అంశంపై, అలాగే పోలీసు సిబ్బందికి “సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ర” అనే అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు.