నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి కొత్త బాధ్యత నుండి తనను తప్పించాలనుకుంటున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. త్రిసూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన సురేష్ గోపీ సోమవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో స్పందిస్తూ నేను మోడీ మంత్రిమండలికి రాజీనామా చేయబోతున్నట్లు కొన్ని మీడియా ప్లాట్ఫారమ్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని అవన్ని అవాస్తవమని సమాదానమిచ్చారు. ప్రధానమంత్రి నరేద్ర మోదీ జీ నాయకత్వంలో మేము కేరళ అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు. సురేష్ గోపి ఇటీవలే ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి ఎన్నికైన తొలి భారతీయ జనతా పార్టీ ఎం.పీ. గా చరిత్ర సృష్టించారు. త్రిసూర్ లోక్సభ స్థానం నుంచి సురేశ్ గోపీ 74,686 ఓట్ల తేడాతో గెలుపొందారు.
సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన బీ.జే.పీ. ఎం.పీ. సురేష్ గోపి…
![Special-Story-on-Actor-Suresh-Gopi,-Ahead-of-His-Birthday_rj7DKMiEUB](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/Special-Story-on-Actor-Suresh-Gopi-Ahead-of-His-Birthday_rj7DKMiEUB.jpg?resize=620%2C496&ssl=1)