మోటోరోల తన తాజా బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్ Moto G34 5Gని భారతదేశంలో జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపింది. మోటోరోల సంస్థ ఈ మొబైల్ ను రూ. 12,000 లోపు ధరతో, అనేక ఇతర ప్రీమియం ఫీచర్లతో పాటు 5G పనితీరును కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్నాప్డ్రాగన్ 695 5G చిప్సెట్ కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో కలిగిన హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన 5,000 mAh బ్యాటరీ కలిగుంటుంది.
50MP ప్రైమరీ సెన్సార్ మరియు 2MP మాక్రోతో కూడిన సామర్థ్యం గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో పాటు 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. Moto Connect డెస్క్టాప్ మోడ్, ఫేస్ అన్లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ ఇతర ముఖ్య ఫీచర్లు కలిగివుంటుంది.