హనుమకొండ జిల్లాలో ఇటీవల మనస్తాపానికి గురయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిని ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె నుంచి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను కేయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ తన స్నేహితురాలు కోసం రాసినట్లు అధికారులు తెలిపారు. ఆ లెటర్ లో స్నేహితురాలిని సంబోధిస్తూ… నీకు చెప్ప కుండా వెళ్తున్నందుకు ఐయామ్ సారీ!.. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరూ నిన్ను విడిచి పెట్టలేరే అని రాసుంది. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ త్రీ మంత్స్ నుంచి నాకు అసలు మంచిగ అనిపిస్తలేదు నా మైండ్ అంతా చనిపొమ్మంటోంది అని రాసి ఉన్నట్లు తెలిపారు. దాని వల్ల అసలు చదువుకోబుద్ది కావడం లేదని అయినా చదివి ఎగ్జామ్స్ రాసినా.. బోర్డు ఎగ్జామ్స్ ఫస్ట్ సాన్స్క్రిట్ పేపర్లో ఒక్క బిట్ రాయలేదని ఇంగ్లిష్ ఓకే. బోటనీ అసలు మంచిగా రాయలేదు. ఆన్సర్స్ అన్నీ వచ్చినా కూడా ఏమీ మంచిగా రాయలేదే.. ఇవన్నీ నీకు చెప్పలేదు అని రాసి ఉందని పోలీసు అధికారులు వెళ్లడించారు.
స్నేహితురాలికి సాహిత్య రాసిన చివరి లెటర్… ఏంముందంటే…!!!
![WhatsApp Image 2024-03-10 at 5.59.15 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-10-at-5.59.15-PM.jpeg?resize=442%2C260&ssl=1)