Kakinada

స్మార్ట్ సిటీ స్కేటింగ్ టెండర్ల పై విచారణ జరపాలి…

5b71512a0e3a706395508ec8_1534153002380

కాకినాడ నగరంలో రూ. 9 కోట్లు వ్యయంతో నిర్మించిన కుళాయి చెరువు ఈశాన్యం ఆవరణలోని వై.ఎస్.ఆర్. ఇండోర్ స్కేటింగ్ సెంటర్ షెడ్ నిర్వహణ ను దాదాపు రూ. 21 లక్షల టెండర్కు దారాదత్తం చేయడం దారుణమని పౌర సంక్షేమ సంఘం మండిపడింది. పూర్వ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా స్కేటింగ్ సెంటర్ లో ఆసక్తి కలిగిన తెలుపు రేషన్ కార్డు దారుల పిల్లలకు ఉచితంగా స్కేటింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారని వారు పేర్కొన్నారు.

15వేల రూపాయల ఫీజులతో ఖరీదైన స్కేటింగ్ పరికరాల అమ్మకాలతో ఉచిత కరెంటు ఉచిత పారిశుద్ధ్యం ఉచిత సౌకర్యాలతో నెలకు రు. 50లక్షల ఆదాయా న్ని పొందుతున్న స్కేటింగ్ నిర్వహణను కంటి తుడుపుగా రూ. 21 లక్షలకు దిగదుడుపు చేయడం అత్యంత అవినీతికి పరాకాష్టగా వుందన్నారు.

దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం వుందని పౌర సంక్షేమ సంఘం తెలిపింది. టెండర్లు రద్దు చేసి రికార్డులు పరిశీలించి కార్పోరేషన్ కు భారం లేకుండా క్రీడా ప్రగతి కల్పించాల్సిన బాధ్యత వహించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ