Trending News

స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-

WhatsApp Image 2024-03-15 at 6.42.56 PM

సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు.

పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి రక్షణ చట్టం ప్రయోజనాలు చేరువ చేసిన దిమ్మల నారాయణ మూర్తిని ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలు బహూకరించారు.

పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ… 1962లో వినియోగదారుల ఉద్యమం అమెరికా నుండి ప్రారంభమై 1983లో ప్రపంచ దినోత్సవమయ్యిందని 1986 డిసెంబర్ 24న జాతీయ వినియోగ దారుల దినోత్సవంగా ముందడుగు వేసిందన్నారు. 2019 లో పటిష్టంగా చట్టం ప్రయోజనాల వికేంద్రీకరణ జరిగిందన్నారు.

కె. తిమ్మాజీరావు చేసిన కృషి వలన కలెక్టర్ సతీష్ చంద్ర హయాం లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కన్స్యూమర్స్ ఫోరం కోర్టు ఏర్పాటు సాధ్యమయ్యిందని అన్నారు. వేలాది మందికి ఉచితంగా ఫోరం పిర్యాదుల దాఖలుకు నిర్వహించిన వారి సేవలు ఆదర్శ ప్రాయమన్నారు. ప్రస్తుతం అటువంటి స్వచ్ఛ సేవలు లభించడం లేదన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్