హర్యానాలోని నుహ్ సమీపంలో శనివారం ఉదయం ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ప్రయానికులతో ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకొని పది మంది భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తావ్ర గాయలు అయ్యాయి. భక్తులు ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావన్ల తీర్థయాత్ర చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మహిళలు, పిల్లలు సహా ఒక కుటుంబానికి చెందిన 60 మందికి పైగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. వారందరూ పంజాబ్ నివాసితులుగా గుర్తించారు. క్షతగాత్రులను నూహ్ మెడికల్ కాలేజీకి తరలించారు.