లోక్సభ స్థానాలపై దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ జే.జే.పీ. తో బీ.జే.పీ. పొత్తు పెట్టుకోవడంతో హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 లో బీ.జే.పీ. తో పొత్తు పెట్టుకున్న జే.జే.పీ. రెండు లోక్సభ స్థానాల కోసం ఒత్తిడి చేస్తోంది, అయితే బీ.జే.పీ. మొత్తం 10 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో హిసార్, భివానీ నుంచి పోటీ చేయాలని జే.జే.పీ. భావిస్తుందన్నారు.
90 మంది సభ్యులున్న సభలో బీ.జే.పీ. కి 41 మంది, కాంగ్రెస్ కు 30, జే.జే.పీ. కి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు స్వతంత్రులు కాగా, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఐ.ఎన్.ఎల్.డి. మరియు హర్యానా లోఖిత్ పార్టీ హెచ్.ఎల్.పి. నుండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారని తెలిపారు. ఆరుగురు స్వతంత్రులు బీ.జే.పీ. కి మద్దతు పలికారు. 4-5 మంది జే.జే.పీ. ఎమ్మెల్యే లు కూడా బీ.జే.పీ. తో టచ్లో ఉన్నారని తెలిపారు.