హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 34వ జాతియ రహదారి పై ప్రయానిస్తున్న బండిని అటువైపుగా వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి ఆ బండిని వేగంగా ఢీ కొట్టింది. దానితో బండి మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు సానుకులంగా స్పందించి గాయ పడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలి పోలీసులకు సమాచారమిచ్చారు. దానితో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమయిన లారీ డ్రైవర్ పరారిలో ఉన్నాడని తెలిపారు. అతని పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అన్నారు.