కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వినూత్నాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అందుకు అనుగుణంగా పార్ట్ టైమ్ జాబ్ పేరిట మోసాలు, ఆన్ లైన్ లోన్ పేరిట మోసాలు మోసపూరిత పెట్టుబడులకు పాల్పడుతున్న 100కు పైగా వెబ్ సైట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటువంటి మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పరిశీలన జరిపిందని తెలిపారు.
అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిషేధించిన వెబ్సైట్లన్నీ వేరే విదేశాల వెబ్సైట్లని అక్కడినుంచే పనిచేస్తున్నాయని వెల్లడించింది. చాట్ మెసెంజర్లు, రెంటెడ్ అకౌంట్ల ద్వారా వీటి కార్యకలాపాలు సాగుతున్నాయని వెల్లడించింది. ఇకపై ఇటువంటి ఆన్ లైన్ మోసాలకు గురుకావద్దని తెలియని వెబ్సైట్లను వాడొద్దని హెచ్చరించిది.