భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మార్చి 21న రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక స్టాక్ను రూ. 5 ముఖ విలువ కలిగిన రెండు ఈక్విటీ షేర్లుగా విభజించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పోస్ట్ బ్యాలెట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా స్టాక్ స్ప్లిట్ కోసం వాటాదారుల నుండి ఆమోదం పొందిన తర్వాత స్టాక్ స్ప్లిట్ కోసం రికార్డ్ డేట్ ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.
కటాఫ్ తేదీ మార్చి 22, 2024 వరకు షేర్లు కలిగి ఉన్న షేర్ హోల్డర్లకు పోస్ట్ బ్యాలెట్ నోటీసు, ఇ-ఓటింగ్ సూచనలు పంపబడతాయని కంపెనీ తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ. 8.85 మధ్యంతర డివిడెండ్ను తమ బోర్డు ఆమోదించిందని రక్షణ సంస్థ తెలిపింది. ఏప్రిల్ 2 మధ్యంతర డివిడెండ్ రికార్డు తేదీగా నిర్ణయించబడిందని తెలిపింది. చెల్లింపు ఏప్రిల్ 18, 2024న లేదా అంతకు ముందు పూర్తవుతాయని తెలిపింది.