Exclusive

15 వేల మంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేసేందుకు సన్నాహాలు… -కలెక్టర్ డా.కృతికా శుక్లా-

WhatsApp Image 2023-11-27 at 8.29.57 PM

జిల్లాలోని జగనన్న కాలనీలలో వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 15 వేల మంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేసేందుకు రానున్న రెండు మాసాల్లో మెగా హౌసింగ్ డ్రైవ్ చేపట్టి నిర్మాణాలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ హౌసింగ్, సమన్వయ శాఖల అధికారులు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రానున్న రెండు నెలల్లో చేపట్టవలసిన గృహనిర్మాణ ప్రణాళిపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో వచ్చే ఫిబ్రవరి నెలలో మరో విడత సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నాని, ఈ కార్యక్రమాల్లో సుమారు 15 వేల మంది లబ్దిదారులచే గృహప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యం నిర్థేశించడం జరిగిందన్నారు.

ఈ మేరకు గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు లబ్దిదారులను చైతన్య పరచాలని, స్వయం సహాయ బృందాల ద్వారా వారికి రుణాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ సిఈ జి.వి.ప్రసాద్, పిడి వై.శ్రీనివాస్, ఈఈలు, డిఈలు, ఎఈలు, కాకినాడ ఆర్డిఓ ఇట్ల కిషోర్, జియం డిఐసి మురళి, కార్మిక, మెప్మా, డిఆర్డిఏ తదితర సమన్వయ శాఖల అధికారులు, నిర్మాణ సామగ్రి సరఫరా దారులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.