1993 ముంబై అల్లర్లకు సంబంధించి 31 ఏళ్లుగా పరారీలో ఉన్న 65 ఏళ్ల వ్యక్తిని ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడు సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ను ముంబైలోని సెవ్రీ ప్రాంతంలో రఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్ పోలీసుల బృందం పట్టుకున్నట్లు ఒక అధికారి వార్తా సంస్థ కి తెలిపారు. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముంబైలో జరిగిన అల్లర్లలో ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో హత్యాయత్నం, చట్టవిరుద్ధంగా సమావేశమయ్యారని అతనిపై అభియోగాలు మోపారు. ఆ సమయంలో ఖాన్ను అరెస్టు చేయగా అతను బెయిల్ పొందిన తర్వాత ఎప్పుడూ కోర్టుకు హాజరు కాలేదని ఒక నివేదిక పేర్కొంది.
1993 ముంబై అల్లర్లకు సంబంధించి వ్యక్త అరెస్ట్…
![ual](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/07/ual.jpg?resize=750%2C421&ssl=1)