విశాఖ పటణం పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయ్యి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పటణం లో వైసీపీ పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ వివరాలను ప్రకటించారు.
ఈ నెల 26 నుంచి అన్ని ప్రాంతాల్లో మూడు భాగాలుగా చేసి 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రతిపక్షాలు చేసిన అవినీతిని ఈ బస్సు యాత్రలో ప్రజలకు తెలియజేసేలా కార్యచరణ రూపొందించామన్నారు. మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్రెడ్డి ఎందుకు కావాలనే అంశంపై ప్రజలకు వివరిస్తాం అని తెలిపారు. 26న ఇచ్ఛాపురం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.