Exclusive

27 న స్పందన, డయల్ యువర్ కమిషనర్… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు వెల్లడి-

IMG-20231126-WA0007

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. స్థానిక సమస్యలను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫోన్ నెంబర్ 08842357800 కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చనీ ఆయన అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. అలాగే 10:30 నుంచి స్పందన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డయల్ యువర్ కమిషనర్,స్పందన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.