ఎన్నో ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఇంద్రపాలెం నుండి చీడుగ, కొవ్వాడ, రామేశ్వరం, అచ్చుతాపురం వెళ్ళే ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇందుకు సంబంధించి స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి దిగవున కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను అధ్యక్షతన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు 3.35 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో చేపట్ట బోయే నిర్మాణ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ… ఇంద్రపాలెం చీడుగా, కొవ్వాడ మీదుగా అచ్యుతాపురం వెళ్లే ప్రధాన రోడ్డు మరమ్మతులకు గురికావడంతో ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో 3.35 కోట్ల రూపాయలు ఖర్చు తో ఈ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొప్పిశెట్టి గణేష్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూయ ప్రభాకర్, ఇంద్ర పాలెం వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పలివల శ్రీనివాస్. ఎంపీపీ పద్మజా బాబ్జి పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.