Exclusive

30 బస్సుల్లో 2,600 మంది రాజ్ నాథ్ సింగ్ మీటింగ్ కి ప్రయాణం…

WhatsApp Image 2024-02-27 at 3.04.19 PM

ఏలూరులో జరగనున్న ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల బూత్ సాయి కార్యకర్తల సమావేశానికి కాకినాడ జిల్లా నుంచి 2600 మంది కార్యకర్తలు 30 బస్సుల్లో ప్రయాణం అయ్యారని కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రాంకుమార్ చెప్పారు .అందులో కాకినాడ నుంచి ఐదు బస్సుల్లో రెండు వందల మంది కార్యకర్తలు స్థానిక అచ్చంపేట జంక్షన్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరారని ఆయన చెప్పారు.

పార్టీ ఆదేశాల మేరకు కేవలం బూత్ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు ,బిఎల్వోలు, శక్తి కేంద్రీ ఇన్చార్జులు మాత్రమే ఈ సమావేశానికి తరలి వస్తున్నారని వారికి రాజనాధ్ సింగ్ రానున్న ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేస్తారని చిలుకూరి చెప్పారు. స్థానిక అచ్చంపేట జంక్షన్ దగ్గర కాకినాడ నగరం నుంచి బయలుదేరిన ఐదు బస్సులకు కాకినాడ జిల్లా ఇన్చార్జి రావూరి సుధ, కాకినాడ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పైడా వెంకటనారాయణ, మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం బస్సులకు జెండా ఊపి కార్యకర్తలను ఏలూరు పంపారు. జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఇప్పటికే వారి వారి సొంత వాహనాల మీద ఏలూరు చేరుకున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.