Political

44 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 2670 కేజీల PDS బియ్యం స్వాధీనం…

WhatsApp Image 2023-11-06 at 9.25.56 PM

కాకినాడ సిటీ సంజయ్ నగర్‌ కాలనీలోని ఒక ఇంటిలో బియ్యం అక్రమ నిల్వ ఉండడాన్ని గమనించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి ఒక ఇంటిని తనిఖీ చేయగా 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో సుమారు 1359 కేజీల PDS బియ్యంను, ఇంటి ఆవరణలో గల ఒక వాహనములో 22 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 1311 కేజీల PDS బియ్యంను మొత్తం వెరసి 44 ప్లాస్టిక్ బ్యాగ్ లలో 2670 కేజీల PDS బియ్యంను గుర్తించామని విజిలెన్స్‌ సబ్-ఇన్స్పెక్టర్ జగన్నాధ రెడ్డి తెలిపారు. ఆ పి.డి.ఎస్‌ బియ్యంను కొల్లి సత్యనారాయణ ఒక కిలో PDS బియ్యాన్ని కాకినాడ మండల పరిసర ప్రాంతాల కార్డుదారుల నుండి రూ. 14/- లకు కొనుగోలు చేసి తిరిగి అదే బియ్యాన్ని రూ. 16/- లకు యానాం పరిసర ప్రాంతా చేపల చెరువుల వారికి విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.