News

8000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్‌

1000039995

 రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం పోర్టు తొలిదశను 2023 డిసెంబరు నాటికి పూర్తిచేయాలనే సంకల్పంతో పనులు జోరందుకున్నాయి. జూన్‌ 2022 లో నవయుగ, అరబిందో కంపెనీలు రూ.2,634.65 కోట్లతో రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి రూ.3,736 కోట్ల వ్యయంతో 850.79 ఎకరాల విస్తీర్ణంలో 34.04 టన్నుల సామర్థ్యం కలిగిన పోర్టు తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు అనుసందానంగా ఈ పారిశ్రామిక పార్కును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా అభివృద్ది పనులు చేపడుతోంది. ఇప్పటికే 4,850 ఎకరాల స్థలంలో పారిశ్రామిక పార్కు పనులు చేపట్టిన విషయం తెలిసిందే.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం