ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకావడంతో అమలాపురంలో రాజకియాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమలాపురం వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. చింతా అనుదాధ భర్త టీ.ఎస్.ఎన్. మూర్తి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. దానితో అమలాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్బంగా బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. ఆయన పి.గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.