ప్రణీత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు పది మంది కీలక వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటలిజెన్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న ప్రభాకర్ రావుతో పాటు పది మంది అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సర్వర్ ను తన ఇంట్లోనే పెట్టుకున్న ఐ న్యూస్ ఎం.డీ. శ్రవణ్ రావు లండన్ పారిపోయినట్లుగా అధికారులు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుమానితులంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం సంచలనంగా మారుతోంది. మాజీ ఎస్పీ భుజంగరావు, SIB డీఎస్పీ తిరుపతి ఇళ్లలో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించామని తెలిపారు. హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీ.సీ.పీ. రాధాకిషన్ రావు ఇంట్లోనూ తనిఖీలు చేశారని అన్నారు. కొన్ని హార్డ్ డిస్క్ లను నాగోల్ మూసీ బ్రిడ్జి కింద పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.