డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలంలో అమలాపురం వై.సీ.పీ. పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, పి.గన్నవరం నియోజకవర్గం వై.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు ప్రముఖ పుణ్యక్షేత్రమయిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి నియోజకవర్గం ఈశాన్య గ్రామం అయిన పొట్టిలంక, కొండుకుదురు శానల్లిలంక, ఎస్.ములపొలం గ్రామలలో వై.సీ.పీ. ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పొట్టిలంక గ్రామంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గుడ్ ఫ్రైడే సందర్భంగా దైవ సన్నిధిలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ ప్రజలు హారతులతో వారికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి హయాంలో వై.సీ.పీ. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగింది అన్నారు. సంక్షేమ పాలన కోసం మరోసారి ప్రజలంతా వై.సీ.పీ. కి అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గన్నవరపు శ్రీనివాస్, చేల్లబోయిన శ్రీనివాస్, నేలపూడి స్టాలిన్ బాబు, ఇందుకూరి నరసింహ రాజు, తదితరులు పాల్గొన్నారు.