ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటే దివ్య ఔషధం మని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు క్రమబద్ధమైన ఓటరు విద్య ఎన్నికలలో భాగస్వామ్యం స్లీప్ లో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పడిన మొదటి నుంచి ఇప్పటివరకు ఓటింగ్ నిర్వహణ తీరును బ్యాలెట్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్, ఓటర్ వెరిఫై బుల్ పేపర్, ఆడిట్ ట్రయల్ విధానాలు ప్రతిబించే విధంగా సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది, డ్వాక్రా, మెప్మా సభ్యులతో భారత దేశ చిత్రపటాన్ని రూపొందించారు.
ఓటు హక్కు వినియోగం, ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను, ఎన్నికల పండగ దేశానికే గర్వకారణం పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం మనుగడకై ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగించుకోవలని, చదువుకున్న వారు, విద్యావంతులు ఇతర వృత్తుల్లో కొనసాగుతున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎంత మాత్రం నిర్లిప్తత ప్రదర్శించరాదన్నారు.