కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తోట నవీన్ ఇంటివద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కష్టాల కడలినుంచి విముక్తి పొందాలంటే జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కలిసి వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దించి మన ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, సుజన కృష్ణ రంగారావు, చిక్కాల రామచంద్రరావు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.