కేరళలోని విద్యావంతులైన యువకుల వలసలపై ఇన్ఫోసిస్ మాజీ సీ.ఎఫ్.ఓ., ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్ మోహన్దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర అతిపెద్ద విషాదంగా పేర్కొంటూ X లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. పరిశ్రమలు, సేవలను ఆకర్షించడానికి మరియు యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కేరళ విధానాలలో గణనీయమైన సంస్కరణల అవసరాన్నిఎక్స్ లో హైలైట్ చేశారు.
ప్రస్తుత రాజకీయ గతిశీలత, యువత రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశాలు లేవని ఉద్ఘాటిస్తూ.. బీ.జే.పీ. జాతీయ కార్యదర్శి అనిల్ కె. ఆంటోనీ చేసిన పోస్ట్కు ప్రతిస్పందనగా ఆయన వ్యాఖ్యలు చేసారు. కేరళలో ఇదే అతిపెద్ద విషాదం. పెద్ద సంఖ్యలో చదువుకున్న యువత కేరళను వదిలివెళ్లిపోతున్నారు.
ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబిస్తోంది. ఏ రాష్ట్రమైనా యువతను పోగొట్టుకుంటే ఎలా అభివృద్ధి చెందుతుంది? కేరళకు పెద్ద సంస్కరణలు అవసరం, పరిశ్రమలను మరియు సేవలను స్వాగతించాలి, వ్యాపార సౌలభ్యాన్ని సృష్టించాలి, ఉద్యోగాలను సృష్టించాలని పాయ్ ఎక్స్లో రాశారు.