ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఆదివారం టెల్ అవీవ్కు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా దేశ రాజధానిని ఇజ్రాయెల్ నగరానికి కలుపుతూ వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని నిలిపివేస్తున్నట్లు వెళ్లడించారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఐదు నెలల విరామం తర్వాత మార్చి 3న టెల్ అవీవ్ సేవలను పునఃప్రారంభించింది. అయితే ఇజ్రాయెల్ నగరంపై హమాస్ దాడి తర్వాత అక్టోబర్-7-2023 నుండి టెల్ అవీవ్ నుండి బయలుదేరే విమానాలు నిలిపివేయబడ్డాయి.