బీహార్లోని పాట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సందర్శించారు. పవిత్ర స్థలాన్ని సందర్శించిన తర్వాత ప్రధాన మంత్రి ప్రజలకు లంగర్ సేవ చేశారు. ఆయన పర్యటన సందర్బంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ జన్మస్థలమైన దర్బార్ సాహిబ్లో ప్రధాన మంత్రి తన నివాళులర్పించారు. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ఉపయోగించిన అరుదైన శాస్త్రాల దర్శనం కూడా చేశారు.