ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తక్కువ దృశ్యమానత, వర్షం కారణంగా విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని సంభందిత అధికారులు తెలిపారు. నగరంలో ప్రతికూల వాతావరణం మరియు దుమ్ము తుఫానుల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం గాలుల కారణంగా దాదాపు 66 నిమిషాల పాటు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
మరో కొన్ని గంటలలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించబడతాయని విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని పలు ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో వర్షం, ఈదురు గాలుల కారణంగా మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ విభాగం థానే, పాల్ఘర్, ముంబైలలో మెరుపులతో కూడిన ఉరుములు, మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ నౌకాస్ట్ హెచ్చరిక జారీ చేసింది.