అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మురమళ్ళ నుండి పల్లంకుర్రు వరకు ఆధునికరించిన ఏటిగట్టు డొల్లతనం గతంలో బయటపడింది. కుండలేశ్వరం స్నాన ఘట్టం సమీపంలో సుమారు 60 మీటర్ల మేర ఏటిగట్టు కాలవపక్క కృంగిపోయింది. ఈ తతంగం జరిగిన తుమ్మ కంపలు, వేప కంపలు వేసి కవర్ చేశారు. సుమారు 8 నెలల తర్వాత కృంగిపోయిన చోట తడిక వైద్యం మొదలుపెట్టారు. సర్వే కర్రలుకు తడికను అతికి మధ్యలో ఇసుకను పోసి చేతులు దులుపుకున్నారు. తడిక వైద్యం వికటించింది.
నెమ్మదిగా తడిక వంగిపోవడంతో సమస్య మరలా మొదటికి వచ్చింది. ఏటిగట్టు రోడ్డు అభివృద్ధి చేయడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రి పగలు వాహనాలు జోరుగా వెళుతుతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులకు గగ్గోలు పెడుతున్నారు . ఏటుగట్టు ఆధునీకీకరణ పనుల్లో అవినీతి జరగడం మూలంగా ఈ దుస్థితి వచ్చిందని ప్రయాణికులు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై విచారణ నిర్వహించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.