మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెరుగుతున్న ధరలకు అనుకునంగా రూ. 600 వేతనం పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ పిఠాపురం య. కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పింపు కార్యక్రమం జరిగింది, అలాగే 3 గ్రామ కమిటీలు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో వచ్చే ఇండియా కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రూ. 600 వేతనం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఈ నేపథ్యంలో పెరిగే ధరలు అనుకూలంగా రూ. 600 వేతనం ఇస్తేనే ఉపాధి హామీ కూలి సంతోషంగా ఉంటారని మధు పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోతే గ్రామీణ కార్మికులు పట్టణాలకు వలసలు పోతారని ఆయన గుర్తు చేశారు.