కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్ నుండి బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక మహిళ మరణించింది. విరేచనాలు, వాంతులు తదితర సమస్యల కారణంగా వారిని ఆసుపత్రుల్లో చేర్చారు.
మృతి చెందిన మహిళను కుటిలకడవ్కు చెందిన ఉజైబాగా గుర్తించారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆమెను త్రిసూర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బంధువులు అక్కడ చికిత్స పొందుతున్నారు. దుకాణం నుండి బిర్యానీ తిన్న 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో రెస్టారెంట్ ప్రస్తుతం మూసివేయబడింది.