జూన్ 18వ తేదీన ఆలస్యంగా బీ.ఎం.సీ. ప్రధాన కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఒక నివేదిక పేర్కొంది. ముంబై పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు చేసినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని తెలిపింది. తదుపరి విచారణ కొనసాగుతోందని వారు తెలిపారు. ఇద్నియా ఆర్థిక రాజధానిలోని 50కి పైగా ఆసుపత్రులకు జూన్ 18న ఇలాంటి బాంబు బెదిరింపు ఇమెయిల్లు వచ్చాయని తెలిపారు. వీటిలో జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కే.ఈ.ఎం. హాస్పిటల్, జే.జే. హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ మరియు ఇతరాలు ఉన్నాయి.