ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాల్లో ఆదివారం నక్సలైట్లు అమర్చిన ఐ.ఈ.డీ. పేలుడులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సి.ఆర్.పి.ఎఫ్. కి చెందిన ఇద్దరు జవాన్లు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని సిల్గర్, టేకులగూడెం మధ్య సుక్మా జిల్లాలోని జాగర్గుండ పీ.ఎస్. పరిధిలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు జవాన్ల మృతదేహాలను తెప్పించామని, సోదాలు కొనసాగుతున్నాయని అదనపు ఎస్పీ ఆకాశ్రావు తెలిపారు. మరణించిన భద్రతా సిబ్బంది కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రా 201 బెటాలియన్కు చెందినవారని అన్నారు. వారిలో ఒకరు కేరళలోని తిరువనంతపురంకు చెందిన విష్ణు ఆర్, ఇతర సిబ్బందిని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శైలేంద్ర గా గుర్తించారు.