ఏ.పీ. లో ఆస్తి పన్నుల చెల్లింపు గడువు జూన్ నెలతో ముగుస్తున్నందున 10శాతం రాయితీతో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వం కోరింది. గత మూడు నెలలు సార్వత్రిక ఎన్నికల రీత్యా మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను నోటీసులను రేట్ పేయర్లకు బట్వాడా చేయలేదని తెలిపారు. జూన్ రెండవ వారం నుండి పూర్వ తేదీనోటీసులె అందించి నెల చివరిలోగా ఆస్తిపన్ను చెల్లించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. రెండు అర్ధ సంవత్సరాల ఆస్తిపన్ను చెల్లించే రేట్ పేయర్లకు పది శాతం పన్ను రిబేటు కల్పించి జూలై నెలాఖరు వరకు గడువు పొడిగించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు డిమాండ్ చేశారు.
ఇంటిపన్నులో రాయితి కల్పించాలి… -పౌరసంక్షేమ సంఘం-
![Property-tax-e1438156901166](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/Property-tax-e1438156901166.jpg?resize=855%2C534&ssl=1)