బీ.ఆర్.ఎస్. అధ్యక్షుడు, మాజీ సీ.ఎం. కే. చంద్రశేఖర్రావు ఎర్రవల్లి ఫామ్హౌస్లో వరుసగా రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వివిధ కారణాలతో సమావేశానికి దూరమైన శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రిని కలిశారు. వీరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, బండారి లక్ష్మా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీశ్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఒత్తిడి వ్యూహాలకు లొంగకూడదని, భవిష్యత్తు బీ.ఆర్.ఎస్. దే అని కాబట్టి గులాబీ పార్టీతోనే ఉండాలని రావు ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం.